మెగా హీరో సాయి తేజ్ వరుసగా హిట్స్ ను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆ తరువాత నుండి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఈ ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ ను సొంతం చేసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి రిపబ్లిక్ సినిమా విడుదల సమయానికి బైక్ యాక్సిడెంట్కు గురైన సాయిధరమ్ తేజ్ ఆస్పత్రిలోనే ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే చేశారు.. సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా మంచి ప్రశంసలు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జీ5 యాప్లో రిపబ్లిక్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.
కాగా ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: