సీనియర్ హీరో రాజశేఖర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇటీవలే రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజశేఖర్ తన శేఖర్ సినిమాను కూడా పొంగల్ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ కు పెద్ద పెద్ద సినిమాలే క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7న విడుదల కావడానికి రెడీ అవుతుండగా, పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహేష్ నటిస్తున్న ‘సర్కారువారి పాట’ జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే, ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ జనవరి 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరి ఇంత భారీ పోటీ ఉన్న నేపథ్యంలో శేఖర్ సినిమాను పొంగల్ బరిలోకి తీసుకురావడం అంటే కొంచం కష్టమే. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా రిలీజ్ డేట్ వచ్చే వరకూ మాత్రం ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అను సితార తోపాటు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని కూడా నటిస్తుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: