యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉండటం.. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా రిలీజ్ కూడా రెండు మూడు సార్లు వాయిదా పడటంతో ఎన్టీఆర్ ను చూసే అవకాశం ఫ్యాన్స్ కు లేకుండాపోయింది. అది జరగాలంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటం.. ఆతరువాత ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రీసెంట్గా ఈ సీజన్ పూర్తి కావడంతో త్వరలో కొరటాల శివ తో చేయాల్సిన ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో వేసిన భారీ సెట్లో జరుగుతుందట.
కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసిన ఎన్టీఆర్, ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈసినిమా ఎంత వరకూ విజయం అందిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: