సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వరుడు కావలెను” సంగీత్ ఈవెంట్ లో హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ .. ఈ మూవీ లో తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాననీ , ఈ సినిమా అంతా కూడా ప్రేమ , పెళ్లి .. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందనీ , అందువలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనీ , ఈ మూవీ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందనీ , దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దారనీ , ఆమె కష్టానికి తగిన సక్సెస్ లభిస్తుందనే నమ్మకం తనకు ఉందనీ , ఇక నాగశౌర్య విషయానికి వస్తే ఆయన సహకారం వల్లనే తన పాత్రను మరింత బాగా చేయగలిగాననీ , ఇక ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ పూజ రావడం నాకు మరింత సంతోషాన్ని కలిగించిన విషయమనీ , .చీఫ్ గెస్ట్ గ ఒక హీరోయిన్ ను పిలవడం చాలా రేర్ అనీ , అలాంటి అవకాశం పూజకి దక్కిందనీ , అందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాననీ , మళ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుసుకుందామనీ , అలాగే 29వ తేదీన థియేటర్లలో కలుసుకుందామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: