సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వరుడు కావలెను”మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా గురువారం గ్రాండ్ గా “వరుడు కావలెను” ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు. పెళ్ళి కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో “వరుడు కావలెను సంగీత్” పేరుతో మేకర్స్ ఓ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. “వరుడు కావలెను సంగీత్” ఈవెంట్ కు పూజా హెగ్డే చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: