అల్లు శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చిన శిరీష్.. ఇప్పటివరకూ మరొక సినిమాను చేయలేదు. ఇక మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఇక ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాకు అల్లుశిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా టాప్ ప్రొడ్యూసర్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సాయి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్ టైన్ మైంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ గా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: