స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయం కేటాయిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితమైన అల్లు అర్జున్ పిల్లలతో తెగ ఎంజాయ్ చేశారు. ఇక కొన్ని రోజులుగా “పుష్ప ” మూవీ షూటింగ్తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రీసెంట్గా తన ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా ఈత కొడుతున్న అల్లు అర్జున్ , అర్హ, ఆయాన్ల వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా తన ఇన్స్టాగ్రామ్లో”ఫ్యామిలీవెకేషన్”అంటూ షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: