సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు నటించే సినిమాలలో ప్రతీ విషయం లోనూ ఆయన సతీమణి నమ్రత ప్రమేయం ఉంటుందనే అపోహ ఉన్న కొంత మంది అభిమానులకు ఆ విషయం లో మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. స్క్రిప్ట్స్ తానే వింటాననీ , మూవీ హిట్ అయినా , ఫ్లాప్ అయినా తానే బాధ్యత వహిస్తాననీ , ఏ మూవీ అయినా ఫ్లాప్ అయితే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించు కొంటాననీ , మరో మూవీ కి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాననీ , తన ప్రయోగాలతో గుణపాఠం నేర్చుకొంటాననీ , తన ప్రొఫెషన్ లో ఇతరుల పై ఆధారపడననీ , స్వంతంగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: