వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్ ఇక ఈసందర్భంగా క్రిష్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాను చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.. నా డ్రీమ్ టీమ్ తో కలిసి 45 రోజుల్లో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాను.. కరోనా టైం లో చాలా మంది డైరెక్టర్స్ తో ఈ బుక్ గురించి చర్చలు జరిపాను.. రైటర్స్ కు ఆ క్రెడిట్ ఇవ్వాలి.. కొండపొలం సినిమా మా మొదటి ప్రయత్నం అంటూ చెప్పాడు. ఇంకా ఓబులమ్మ పాత్ర అనేది నిజానికి నవలలో లేదు కానీ సినిమా కోసం తీసుకున్నాం.. రకుల్ తన పాత్రలో జీవించేసింది.. ఇంకా వైష్ణవ్ తేజ్ పాత్ర కూడా అలాంటిదే.. ఈ సినిమా విజయం అనేది తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి, సమాజానికి అవసరం అని తెలిపాడు క్రిష్.
కాాగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: