తన అందం , అభినయం తో అలరిస్తూ కూర్గ్ బ్యూటీ రష్మిక శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమాబ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో బాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా “ప్రొడక్షన్ నెం 7 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ నటిస్తున్న ఈ మూవీ లో మృణాళ్ ఠాకూర్ కథానాయిక. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్ , కశ్మీర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో రష్మిక అతిథి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రష్యా లో కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: