సాయి తేజ్ హీరోగా దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
ఇక ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకునేలా ఉంది. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’, ‘మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు’, ‘గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’ లాంటి దేవ్ కట్టా మార్క్ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెంచారు.
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: