సెల్ ఫోన్స్ పగలకొడతాం అని పుష్ప టీం అంటుంది. అదేంటీ పుష్ప టీం సెల్ ఫోన్స్ పగలగొట్టడం ఏంటీ అనుకుంటున్నారా.. దానికి కారణం లీక్స్. పుష్ప సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు కానీ.. అలానే అప్ డేట్స్ ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే కదా. దీనిపై నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా స్పందిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక రీసెంట్ గా మరోసారి బన్నీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక హోటల్లో అల్లు అర్జున్ టిఫిన్ చేసిన వీడియో బయటకు రాగా ఎంత వైరల్ అయిందో చూశాం. అయితే అవుట్ డోర్ లో షూటింగ్ కాబట్టి ఇలాంటి లీక్స్ రాకుండా ఆపడం అనేది కష్టమే. దీంతో పుష్ప టీం ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే షూటింగ్ స్థలంలో ‘ఫొటోలు, వీడియోలు తీస్తే సెల్ ఫోన్ ను పగలగొట్టబడును’ అని బోర్డులు పెట్టారు. విచిత్రం ఏంటంటే వీటిని కూడా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తవుతుంది.
కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఫహద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: