ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేసి ఫ్రీగా ఉన్నాడు. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా ప్రారంభానికి ఇంకా లేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను రాజకీయ నేపథ్యంలో కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో కొరటాల తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ లేదా అలియా భట్ హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను ఎంపిక చేయనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించబోతున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించనున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: