దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆతరువాత ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా అనుపమ ఈసినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టాలో ఒక ఫొటో షేర్ చేస్తూ తెలిపింది. కాగా ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్టోబర్ లో ఈసినిమా రిలీజ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: