జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ లో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రిపబ్లిక్”మూవీ లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ గా సాయి తేజ్ నటించారు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ లుక్ను సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం! అయినా నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం!’’ అని పోస్టర్పై ఉన్న లైన్స్ సినిమాలో మైరా హన్సన్ పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్య రాజేశ్ పాత్రలోని తీవ్రత ను తెలియజేస్తున్నాయి. “రిపబ్లిక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: