ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిసారి డీగ్లామర్ లుక్ లో, ఊరమాస్ పాత్రలో బన్నీ కనిపిస్తుండటంతో బన్నీని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు ఇంకా తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముంగించే పనిలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే సుకుమార్ కూడా నటీనటులను తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో కీలక పాత్రలో మరో టాలెంటెడ్ హీరోను సుకుమార్ తీసుకున్నాడు. ఆ నటుడు ఎవరో కాదు. భైరవ గీత ఫేమ్ ధనుంజయ. కన్నడ నటుడు ధనుంజయ ఈ సినిమాలో ‘జాలి రెడ్డి’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మేరకు తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసనిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: