ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసే ప్రభాస్ ఇప్పుడు మాత్రం పార్లర్ గా ఒకటి లైన్ లో ఉండగానే మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాతో పాటుగా మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ‘ఆది పురుష్’ షూటింగ్ ప్రభాస్ ముంబై వెళ్లగా.. ఈ సినిమా షూటింగులో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ చివరి వరకూ ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇక మరోవైపు ఈసినిమా ప్రకటించి నేటికి ఏడాది అవడంతో ఫ్యాన్స్ వన్ ఇయర్ ఫర్ ఆదిపురుష్ అనౌన్స్ మెంట్ అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: