రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పెద్ద సినిమాలు నిర్మించడానికి ఇన్ఫిరేషన్ గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఆసినిమా వల్లే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్ సినిమాలే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు మరో విషయంలో కూడా బాహుబలి సినిమా కూడా ఇన్ఫిరేషన్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా వల్ల కె.జి.యఫ్ ను రెండు పార్ట్ లుగా తీస్తుండగా.. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాను కూడా ఇప్పుడు రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు సలార్ ను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మరేదో కాదు…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మణిరత్నం ‘దర్శకత్వంలో వస్తున్న పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మొదటి పార్ట్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసి ఆ తరువాత పార్ట్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయ రాం, ప్రభు లాంటి స్టార్లు నటించనున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: