రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమాకు ఇన్ని రోజులు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ఫైనల్లో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడటంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్. ఈనేపథ్యంలోనే తెలుగు కోసం టాలీవుడ్ టాప్ రైటర్ ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రైటర్ ఎవరో కాదు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న బుర్రా సాయిమాధవ్. ఇప్పటికే సాయి మాధవ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పుడు శంకర్ సినిమాకు కూడా సాయి మాధవ్ డైలాగ్స్ అందించనున్నాడు. శంకర్ రూపొందించనున్న చిత్రానికి సంభాషణలు రాసే బాధ్యత సాయిమాధవ్కే అప్పగించారు.
ఇక క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాయిమాధవ్.. ఆ తర్వాత చాలామంది పేరున్న దర్శకులు, హీరోలతో పని చేశాడు. చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’కి ఆయన సంభాషణలు రాశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: