రీఎంట్రీ తరువాత చిరంజీవి ఫుల్ స్పీడుమీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సెకండ్ వేవ్ ముందే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఒక రెండు వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభమవ్వడంతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొననున్నారు. వీటితో పాటు మూడు కొత్త సినిమాలను ఓకే చేశారు చిరంజీవి. అందులో ఒకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్, మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. లూసిఫర్ రీమేక్ను ఎ.మోహన్రాజా తెరకెక్కిస్తుండగా, వేదాళం రీమేక్లను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు. ఇవి కాకుండా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం మేరకు వేదాళం రీమేక్ కంటే ముందుగానే బాబి సినిమా ట్రాక్ ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు తగినట్లుగా డైరెక్టర్ బాబి, మైత్రీ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశాయట. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈసినిమాలో చిరు వింటేజ్ లుక్ లో కనిపించనున్నారట. చిరు కోసం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ నేపథ్యంలో కథను రాశాడట బాబి. గతంలో చిరు చేసిన గ్యాంగ్ లీడర్ టైప్ లో ఉండబోతుందట. మరి గ్యాంగ్ లీడర్ టైప్ అంటే సినిమా ఖచ్చితంగా ప్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
ఇక ఈసినిమాలో ఇప్పటికే బాలీవుడ్ లెజెండరీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, అలాగే హీరోయిన్ పాత్రలో సోనాక్షీ సిన్హా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: