టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకుంది. దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” షూటింగ్ రెండో షెడ్యూల్ను మేకర్స్ విదేశాల్లో ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా ఇక్కడే చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారనీ , విశాఖ తీరాన పలు లొకేషన్స్ ఫైనల్ చేసి చిత్రీకరణ జరపాలని దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం.విశాఖ ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లో హీరో, హీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్ను కూడా దర్శకుడు తెరకెక్కించనున్నారు. పలు మూవీస్ లో నటించినా మహేష్ బాబు ఇప్పటివరకూ వైజాగ్ లో షూటింగ్ లో పాల్గొనలేదు. “సర్కారు వారి పాట”మూవీ కోసం మహేష్ బాబు ఫస్ట్ టైమ్ వైజాగ్ లో అడుగుపెట్టడం విశేషం. జులై 12 వ తేదీ నుండి “సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “SSMB 28 “, అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: