ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైన తాప్సీ ఆతరువాత పలు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత తాప్సీ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక దీనితో పాటు చాలా గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో `మిషన్ ఇంపాజిబుల్` సినిమా తెరకెక్కుతుంది. ఇక తాజాగాఈసినిమాషూటింగ్లో తాప్సీ జాయిన్ అయింది. ఈ రోజు నుండి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది చిత్ర యూనిట్. అలాగే చేతికి కట్టుతో ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
This ‘Mishan’ is surely ‘Impossible’ with out her🙌
Welcoming the amazingly talented @taapsee on board for #MishanImpossible🤩@swarooprsj @iamMarkKRobin #NiranjanReddy #AnveshReddy @pasha_always @MatineeEnt #TaapseePannu pic.twitter.com/dajWA2jeQE
— Matinee Entertainment (@MatineeEnt) July 6, 2021
ఈ సందర్భంగా తాప్సీ పన్ను మాట్లాడుతూ – “గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. మిషన్ ఇంపాజిబుల్ అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశం మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ లాంటి మంచి టీమ్ కావడంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలను అని నమ్ముతున్నాను“ అన్నారు.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: