పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. షూటింగ్ లకు అనుమతి ఇస్తుండటంతో పూరీ జగన్నాథ్ ‘లైగర్‘ తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చినట్టు ఈమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ‘లైగర్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మరియు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 200 కోట్ల రూపాయలను కోట్ చేసిందని వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలు కాస్త రౌడీ హీరో వరకూ చేరడంతో దీనిపై స్పందించాడు. ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు ఏ విషయాన్ని అయినా. ఇక ఈవార్తలపై స్పందించిన విజయ్ కూడా రూ.200 కోట్లు అనేది చాలా తక్కువ అని.. నా సినిమా థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని కౌంటర్ ఇచ్చాడు. దీన్ని బట్టి విజయ్ తన మూవీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థం అవుతోంది. చూద్దాం మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో..
Too little.
I’ll do more in the theaters. pic.twitter.com/AOoRYwmFRw— Vijay Deverakonda (@TheDeverakonda) June 21, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: