సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో “శాకినీ -ఢాకినీ ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాకినీ -ఢాకినీ ” మూవీ షూటింగ్ జూలై 4వ తేదీ ఒక ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభం కానుందనీ , రెజీనా, నివేదా థామస్ మధ్య వచ్చే ఈ ఫైట్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ మూవీ లోని తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. “శాకినీ -ఢాకినీ ” మూవీ ని దసరా పండగకు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవే బ్యానర్స్ పై కొరియన్ రీమేక్ మూవీ గా రూపొందిన “ఓ బేబీ “మూవీ ఘనవిజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: