సినిమా రిలీజ్ లు సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలు షూటింగ్ లు స్టార్ చేసేశారు కూడా. అయితే థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి మాత్రం టైమ్ పడుతుంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకఇదిలా ఉండగా థియేటర్లు తెరిచినా తమ సినిమాను అప్పుడే రిలీజ్ చేయమని చెబుతున్నారు లవ్ స్టోరీ మేకర్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతుంది అని ఆయన అన్నారు. “థియేటర్లలో రోజుకు 3 షోలకు మాత్రమే అనుమతిస్తే అప్పుడు “లవ్ స్టోరీ”ని రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే “లవ్ స్టోరీ” విడుదల చేయడం గురించి ఆలోచిస్తాము. జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాము” అని సునీల్ నారంగ్ చెప్పారు.
కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఈసినిమా తెరకెక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: