మంచు విష్ణు– శ్రీను వైట్ల కాంబినేషన్లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. గత ఏడాది విష్ణు బర్త్డే సందర్భంగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఢీ అండ్ ఢీ ( “డబుల్ డోస్”) పేరుతో తో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే శ్రీనువైట్ల స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈ సినిమా సీక్వెల్ కాదని చెపుతున్నాడు. ఢీ స్టోరీతో దీనికి లింక్ లేదని… కాకపోతే కొన్ని పాత్రలు ఆ సినిమాతో పోలి ఉంటాయి అని… ఖచ్చితంగా ఇది మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఇటీవలే వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో శ్రీను వైట్ల కాస్త వెనుక పడ్డాడు. శ్రీను వైట్ల అయితే బాద్షా తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో ఆల్ మోస్ట్ కనుమరుగు అయిపోయాడు. అందులోనూ కొత్త కొత్త డైరెక్టర్స్.. కొత్త టాలెంట్ వస్తుండటం.. పోటీ ఎక్కువవుతుండటంతో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి కూడా నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి ఏర్పడింది. చూద్దాం ఈ సినిమాతో అయినా గాడిలోకి వస్తాడేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: