పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30వ తేదీ రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది. హైదరాబాద్ , ఇటలీ , జార్జియా లలో షూటింగ్ జరుపుకున్న “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ కేవలం పది రోజులు మాత్రమే బ్యాలెన్స్గా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్స్ను రూపొందిస్తున్నట్లు , ఆ సెట్స్ లో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ షెడ్యూల్తో టాకీపార్ట్ మొత్తం పూర్తి కానుంది. జులై 30 వ తేదీ రిలీజ్ కాకపోతే దసరా పండగ కు “రాధేశ్యామ్ “మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: