నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“థ్యాంక్ యు”మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య , హీరోయిన్ రాశీఖన్నా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ సింక్ సౌండ్ టెక్నాలజీ తో దర్శకుడు విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. సింక్ సౌండ్ టెక్నాలజీ అంటే లొకేషన్ లో చిత్రీకరించిన షాట్ లో రికార్డ్ చేసిన సౌండ్ ని ఫైనల్ ఎడిటింగ్ కు తీసుకువెళ్ళవచ్చు. సెపరేట్ గా డబ్బింగ్ చెప్పవలసిన అవసరం లేదు. సింక్ సౌండ్ టెక్నాలజీ తోతెరకెక్కుతున్న “థ్యాంక్ యు” మూవీ లో నటిస్తున్నందుకు రాశీఖన్నా ఆనందం వ్యక్తం చేశారు. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత “థ్యాంక్ యు” మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: