మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశంలో హిందీ మార్కెట్ పెద్దది కావడంతో టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. “లైగర్ ” మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. డబ్బింగ్ మూవీస్ తో అల్లుఅర్జున్ ఉత్తరాదిన క్రేజ్ పెంపొందించుకున్న విషయం తెలిసిందే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “పుష్ప ” చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఒక పెద్ద ప్రమోషన్ ఏజెన్సీతో హీరో టీమ్ చర్చలు జరుపుతున్నారనీ , ఫ్యూచర్ లో స్ట్రెయిట్ హిందీ మూవీ చేసే ఆలోచనలో ఉన్న బన్నీ.. ఇప్పటి నుంచే దానికి తగ్గట్లే ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. “పుష్ప “మూవీ తరువాత అల్లు అర్జున్ నటించే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గానే రూపుదిద్దుకోనున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: