గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ పేరు మారు మ్రోగి పోతుంది. ఎన్నో సినిమాల్లో రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. కరోనా వల్ల రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిగా పేరుతెచ్చుకున్నది మాత్రం సోనూసూద్.ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో సోనూసూద్ ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్రం పరిగికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ముంబయి పాదయాత్ర మొదలు పెట్టాడు. హైదరాబాద్ నుండి అతడి పాద యాత్ర మొదలు పెట్టాడు. తన తండ్రి నడుపుతున్న ఆటో ను ఈఎంఐ కట్టలేని కారణంగా బ్యాంకు వారు ఆటోను సీజ్ చేయడంతో మా నాన్న మానసికంగా కృంగిపోయారని.. ఎంతో మందికి సాయంగా నిలుస్తున్న సోనూసూద్ తన తండ్రి కోసం సాయం చేస్తాడనే నమ్మకంతో ముంబయికి వెళ్తున్నట్లుగా చెప్పుకొస్తున్నాడు వెంకటేష్. హైదరాబాద్ నుండి ముంబయికి 720 కి.మీ వరకు ఉంటుంది. అంత దూరంను కాలి నడకన వెళ్లి సోనూసూద్ ను కలిసేందుకు వెంకటేష్ చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. లేకపోతే ఈలోపే సోనూసూద్ వరకూ ఈవార్త వెళ్లి తనే సాయం చేస్తాడా.. చూద్దాం ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: