క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న “లైగర్ “మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ముంబై లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో షూటింగ్స్ నిలిచిపోతున్నాయి. ముంబై లో కోవిడ్ -19 ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో”లైగర్ “చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేశారు. మేజర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “లైగర్ “మూవీ క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు , సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా మెసేజ్ ఇవ్వనున్నట్లు, క్లైమాక్స్ కూడా దాదాపు 15నిముషాలు ఉంటుందనీ సమాచారం. “లైగర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: