మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా రూపొందుతున్న ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ థాయ్ ల్యాండ్ లో 40 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. 6రోజుల సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో కంప్లీట్ అయ్యింది. పొల్లాచి లో మైనర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రధాన తారాగణం తో మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్, మాండ్వా, మహేశ్వర్ లొకేషన్స్లో మరో షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యా రాయ్ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలకు భారీగా జూనియర్ ఆర్టిస్టులు అవసరపడడం తో అక్కడి స్థానికులను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: