టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు . బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న ” #VIJAY65″ తమిళ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. కరోనా నుండి కోలుకున్న పూజాహెగ్డే , తన అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పలు పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో పూజాహెగ్డే ముంబై లో తన ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరవస్తువులను పూజాహెగ్డే పంపిణీ చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఆహార పదార్థాలను స్వయంగా ప్యాక్ చేసి పేదలకు అందిస్తూ ఈ కష్టకాలంలో జీవితంపై ఆశలు కోల్పోవద్దనీ , త్వరలోనే మంచి రోజులు వస్తాయనీ పూజాహెగ్డే ధైర్యం చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: