పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారినా ఏక్ మినీ కథ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు సంతోష్ శోభన్. బోల్డ్ కంటెంట్ తో ఉన్నఈసినిమాకు మొదటినుండి మంచి బజ్ ఏ ఉంది. అలానే ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా సపోర్ట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలను బాగా రీచ్ అయింది కూడా ఈసినిమా. అమెజాన్ లో మే 27న రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సంద్బంగా తాజాగా ఓ ఇండర్వ్యూలో పాల్గొన్న సంతోష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నా సినిమాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది… వందశాతం మనస్ఫూర్తిగా నవ్వుకున్నామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అంతకు మించిన ప్రశంస లేదు. లాక్డౌన్ సమయంలో ప్రజల్ని నవ్వించగలడం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. మేం ఎప్పుడూ ఈ కథ, సినిమా చేయడం రిస్క్ అనుకోలేదు. చాలా క్లీన్గా, ఎటువంటి వల్గారిటీ లేకుండా మేర్లపాక గాంధీగారు ఈ సినిమా కథ రాశారు.. దానిని యూవీ, మ్యాంగో లాంటి సంస్థలు ముందుకొచ్చి నిర్మించాయి అని తెలిపాడు.
ప్రస్తుతం ఈహీరో మరో రెండు కథలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అవి కూడా పెద్ద బ్యానర్ లోనే. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తున్నా.. అందులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వైజయంతి మూవీస్తో ఒకటి, సితార ఎంటర్టైన్మెంట్లో మరో సినిమా చేయాలి. నా స్నేహితుడు అభిషేక్ మహర్షి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించా అని స్పష్టం చేశాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: