నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మొత్తం ఆ నట సార్వభౌముడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా తాతను గుర్తుచేసుకున్నాడు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం అందరినీ హత్తుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/a3wAJeN6XR
— Jr NTR (@tarak9999) May 28, 2021
ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు.
తన యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని..తాతాకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత కొరటాలతో మరో సినిమా.. ఆతరువాత ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: