దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తి చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. అయితే దీనిపై నిర్మాతపై క్లారిటీ ఇచ్చాడు. ఎస్.ఆర్.ప్రభు. రీసెంట్గా జరిగిన ఓ సోషల్ మీడియా చాట్లో ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్తో ‘విక్రమ్’ తీస్తున్నాడు. కార్తి చేతిలో సర్దార్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు ఉన్నాయి. వారి సినిమాలు అయిపోయిన తర్వాత ఈసినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: