పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాగ్జిమమ్ ఫస్ట్ లుక్ నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మొదటగా మహానటి కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన నటిస్తుంది. ఇక ఈసినిమా బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి.. అందులోనూ మహేష్ ప్రీ లుక్ ను బట్టి ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది అనుకుంటున్నారు. అయితే ఈసినిమాలో పరుశురామ్ సూపర్ కామెడీ ట్రాక్ రాశాడని అంటున్నారు. అంతేకాదు కీర్తి సురేష్ కు కూడా మంచి కామెడీ సీన్స్ రాశాడని.. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ చాలా నవ్వుతెప్పిస్తుందని అంటున్నారు. ఇప్పటికే రంగ్ దే లో తన కామెడీ యాంగిల్ ను బయట పెట్టింది కీర్తి సురేష్. ఇక ఈసినిమాతో మహష్ ఫ్యాన్స్ కు కీర్తి కామెడీ ట్రీట్ ఇవ్వనుంది. దీనితోపాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మధ్య కూడా మరో కామెడీ రానుందని, ఈ సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం.
కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరో నెలలో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్. సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: