స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య ” మూవీ లో పూజాహెగ్డే , రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీ గా పూజాహెగ్డే ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రణ్ వీర్ సింగ్ , పూజాహెగ్డే జంటగా బాలీవుడ్ మూవీ “సర్కస్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరో గా తెరకెక్కే “కభీ ఈద్ కభీ దివాలీ “మూవీ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ తో నటించేందుకు ఎదురు చూస్తున్నట్లుగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ కరోనా కారణంగా “కభీ ఈద్ కభీ దివాలీ “మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుంది. సల్మాన్ ఖాన్ తో ఎన్నో విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్నాననీ , ఆయన్ను ఎంతగా అభిమానించానో కూడా చెప్పాలనుకుంటున్నట్లుగా పూజాహెగ్డే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఇటీవల కరోనా బారిన పడిన పూజా హెగ్డే పూర్తిగా రికవరీ అయ్యింది. అతి త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. పూజాహెగ్డే వచ్చే నెలలో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: