ఒక్కసినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వచ్చేసింది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈఅమ్మడికి ఆసినిమా బ్లాక్ బస్టర్ తో దశ తిరిగిపోయింది. వరుస సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అయితే కృతిశెట్టి మాత్రం ఆచితూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. అయితే మరోపక్క కృతిశెట్టి పై పలువార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తుందని..ఎక్కువ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తుందన్న రూమర్లు కూడా వచ్చాయి. అందులో బెల్లంకొండ గణేష్ చిత్రం కూడా కాగా.. తేజ సినిమా కూడా ఒకటి ఉందని ఇలా కొన్ని ప్రాజెక్ట్లు రిజెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై కృతిశెట్టి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ప్రస్తుతానికి తాను కేవలం మూడు తెలుగు ప్రాజెక్ట్లు మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. ‘నా తదుపరి ప్రాజెక్ట్ల గురించి ఈమధ్య చాలా వార్తలు నేను వింటున్న… ఇప్పటివరకూ నేను కేవలం మూడు ప్రాజెక్ట్లకు మాత్రమే సంతకం చేశాను. అందులో ఒకటి నాని శ్యామ్ సింగరాయ్, మరొకటి సుధీర్బాబు, మూడోది రామ్ సినిమా. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్లపైనే నా దృష్టి అంతా ఉంది. ఈప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాతే వేరే ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాను.. ఒకవేళ నేను ఏదైనా ప్రాజెక్ట్ని ఓకే చేస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తాను.. ఈపాండమిక్ సమయంలో దయచేసి ఇంట్లోనే ఉండండి’ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొంది.
Please take care of yourself and your family, times are difficult but please try to be strong and stay safe ♥️
— KrithiShetty (@IamKrithiShetty) May 18, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: