ఇప్పటికే కరోనావల్ల ఎంతోమంది సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక ఇప్పుడు మరో నిర్మాతకు పితృవియోగం కలగగా.. అలాగే స్టార్ హీరో తాతను కోల్పోయాడు. ఆ నిర్మాత ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ కాగా ఆ స్టార్ హీరో రామ్ పోతినేని. హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న రామ్ తాతయ్య ఈరోజు మరణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తన తాతయ్య మరణంపై హీరో రామ్ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ అయ్యాడు ‘‘విజయవాడలో లారీ డ్రైవర్గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యులకు అన్ని రకాల వసతులను అందించడం కోసం మీరెంతో కష్టపడ్డారు. లారీ టైర్లపై నిద్రించేవారు. మీరు రాజులాంటి వారు. జేబులో ఉన్న డబ్బుని బట్టి కాకుండా, మంచి మనస్సు వల్లే ధనవంతులవుతారని, మీరే మాకు నేర్పించారు. మీ కారణంగానే మీ పిల్లలందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు. మీ మరణ వార్త నన్ను ముక్కలు చేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తాత’’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Thank you for dreaming big for your children & making them what they are today.
Rest In Peace, Tatagaru. 💔#RAPO
2/2
— RAm POthineni (@ramsayz) May 18, 2021
కాగా ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: