ప్రశాంత్ వర్మ.. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే రకమైన సినిమాలు కాకుండా విభన్నమైన సినిమాలు చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే జాంబిరెడ్డి అనే సినిమా కూడా తీసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉండగా ఈసినిమాకంటే ముందే ప్రశాంత్ వర్మ అ2 సీక్వెల్ ను తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ సీక్వెల్ మధ్యలోనే ఆగింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ ఆసినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పుకొచ్చాడు. నిజానికి ‘అ 2’ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమైందని, ఓ బాలీవుడ్ స్టార్తో దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయాలనుకున్నాను… అంతా ఓకే అయిన తర్వాత ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని చెప్పడంతో ‘అ2’ సినిమా వెనక్కి వెళ్లిందని తెలియజేశాడు. మరి స్క్రిప్ట్ ఎలాగూ రెడీ గా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఈసీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండొచ్చు..
కాగా పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మాతగా . ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ‘అ’. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, రెజీనా ప్రధాన పాత్రల్లో 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఓ కొత్త సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. పలు అవార్డులను సైతం దక్కించుకుంది ఈ సినిమా.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: