“ఇరువర్ ఉల్లమ్ “తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ “చెన్నా మేరియా” మూవీ తో పంజాబీ చిత్ర పరిశ్రమకు , “వీరే కి వెడ్డింగ్ “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి పాయల్ అభిమానులను అలరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. పాయల్ ప్రస్తుతం ఒక పంజాబీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విరామంలో పంజాబీ సొగసరి పాయల్ రాజ్పుత్ తనలోని కొత్త కళను ప్రేక్షకులకు పరిచయం చేశారు . చిత్రకారిణిగా మారిన పాయల్ ఓ అందమైన కాన్వాస్ పెయింటింగ్ వేసింది. పచ్చిక బయళ్లను, నీలాకాశాన్ని వర్ణరంజితంగా చిత్రించిన పాయల్ ఆ పెయింటింగ్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. చిత్రలేఖనంతో పరిచయం ఉన్నా ఇదివరకెప్పుడూ కాన్వాస్ పెయింటింగ్స్ వేయలేదనీ . ఇదే నా తొలి ప్రయత్నమనీ , పికాసోలా ఊహించుకుంటూ ఈ పెయింటింగ్ వేశాను’ అనీ పాయల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: