భారత దేశంలో కరోనా వేవ్ అధిక ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. లక్షలలో కేసులు నమోదు , వేలల్లో మరణాలుసంభవిస్తున్నాయి. ప్రజలలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రజలలో కరోనా పట్ల భయాన్ని తొలగించి , ధైర్యాన్ని నింపేలా , కరోనా కష్ట కాలాన్ని అధిగ మిస్తామనే భరోసా నిచ్చేలా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ కష్ట కాలంలో ప్రతీ ఒక్కరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాననీ , ఇటువంటి దుర్భర స్థితిలోంచి బయటపడేందుకు మనమే ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోవాలనీ , అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించండనీ , ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించమనీ , మీకు మీరే స్వీయ నిర్భంధాన్ని విధించుకోండనీ, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఉండండనీ , ప్రతీ ఒక్కరికీ వారి బాధను ఎలా చెప్పుకోవాలో తెలిసి ఉండకపోవచ్చనీ , అందరూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండనీ, ప్రతీ రోజూ ఓ పాజిటివిటీతో మొదలుపెట్టండనీ , జీవితంలో మనకు ఆ పాజిటివ్ ఎనర్జీయే అవసరం. మనకు చేతనైనంత సాయం చేయండనీ , మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తామనీ అనుష్క మెసేజ్ షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: