ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ఇక క్రిష్ గురించి తెలిసిందే కదా.. ఈసినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో చాలా తక్కువ రోజుల్లోనే పూర్తిచేశాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సమ్మర్లో మూవీ విడుదల అవుతుందని అనుకున్నారు. కాని ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సినిమా రిలీజ్ లు అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఈసినిమా కూడా ఓటీటీలో రీలిజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన క్రిష్ ఆవార్తల్లో నిజం లేదని.. ఓటీటీలో రిలీజ్ చేయడంలోదని.. థియేటర్ లో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలా.. డీగ్లామర్ రోల్ లో రకుల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని క్రిష్-రాజీవ్ రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈసినిమాతో పాటు క్రిష్ పవన్ తో కూడా మరో సినిమా చేస్తున్నాడు. హరి హర వీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కరోనా బారిన పడటం.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో షూట్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: