కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ‘జగమే తంత్రం’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది కానీ తెలిసిందే కదా గత ఏడాది కూడా కరోనా వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే సాధారణ పరిస్థితులు వచ్చాక రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఎందుకో ఆతరువాత కూడా రిలీజ్ చేయలేదు. ఇక ధనుష్ ఫ్యాన్స్ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కు షాకిచ్చారు చిత్రయూనిట్. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ఎదురు చూశారు కానీ కోవిడ్ నేపథ్యంలో చివరకు డైరెక్ట్ ఓటీటీ విడుదలకు డీల్ కుదుర్చుకున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘నెట్ ఫ్లిక్స్’ లో జూన్ 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.
దీనితోపాటు మరో థ్రిల్లర్ చేస్తున్నాడు. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుండగా.. ముక్తి అమ్మన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్మృతి వెంకట్ ధనుష్ కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: