ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. దర్శకులు ఆదిశగా కథలు రాస్తుంటే హీరోలు కూడా ఏం ఆలోచించకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న భారీ మల్టీస్టారర్ అంటే ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకా ఆచార్య సినిమాలో చిరుతో చరణ్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవన్-రానా మల్టీస్టారర్ గా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అది ఎవరిదో కాదు అక్కినేని నాగార్జున-అఖిల్ కాంబినేషన్ లో. ఆవిషయాన్ని నాగార్జుననే స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే నేను నా పెద్ద కొడుకు నాగ చైతన్యతో కలిసి మనం సినిమాలో నటించా… ఇప్పుడు అఖిల్ తో చేయాలి..ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అని కన్ఫామ్ చేశారు. మరి నాగచైతన్యతో చేసిన మనం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖిల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.
ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు. ఏజెంట్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కనుంది. మే నుండి ఈసినిమా షూటింగ్ మొదలుకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: