ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది కంటే ఈఏడాది ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతిరోజూ లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా సినీ, రాజకీయరంగంపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. అయితే ప్రభాస్ కు కరోనా రాలేదు లెండి. తను ఐసోలేషన్ కు వెళ్లడానికి కారణం తన పర్సనల్ మేకప్ మెన్ కు కరోనా రావడమే. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభాస్కు కూడా ఐసోలేషన్లోకి వెళ్లాడు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటికీ బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిబీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఏదో చిన్న పోర్షన్ మాత్రం షూటింగ్ మిగిలిఉంది. అది కూడా త్వరలోనే పూర్తిచేయనున్నారు. ప్రస్తుతం ముంబైలో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్తోపాటు మొత్తం రాధేశ్యామ్ చిత్రయూనిట్ అంతా కూడా సెల్ప్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈసినిమా చేస్తూనే మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: