మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “గీతగోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయిక. వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. దుబాయ్ లో కీలక యాక్షన్ సీన్స్ తో పాటు హీరో , హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున ప్రారంభం అయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: