పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. ఈమూవీ లో పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న “లైగర్ “మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలల తరువాత షూటింగ్స్ సజావుగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో షూటింగ్స్ నిలిచిపోతున్నాయి. ముంబై లో కోవిడ్ -19 ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో “లీగర్ “చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేసి హైదరాబాద్ కు బయలుదేరినట్టు , బ్యాలెన్స్ షూటింగ్ ను హైద రాబాద్ లోనే కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్ “పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























