దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్.. ఓ రేంజ్లో ఉండటంతో.. సినిమా బ్లాక్బస్టర్ పక్కా అని అప్పుడే ఇండస్ట్రీ అంతా చర్చలు నడుస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా చోట్ల టికెట్స్ బుక్ అయిపోయాయి. అంతేకాకుండా ఈసినిమాకోసం స్పెషల్ షోలకు అనుమతులకు ప్రయత్నించారు కానీ ఇంకా అనుమతులు అయితే రాలేదు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫస్ట్ షో టైమ్ 7 కి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. చాలా చోట్ల ఉదయం 7గంటలకే ఫస్ట్ షో పడిపోయేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: